అర్ధరాత్రి ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు

TG: కరీంనగర్ బస్ డిపో-2లో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. డిపో ఆవరణలో పార్కింగ్ చేసిన TGSRTC ఎలక్ట్రికల్ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల్లో ఈ తరహా అగ్నిప్రమాదం జరగడం ఇది వరుసగా మూడోసారి.



