ట్విషా శర్మ కేసులో గిరిబాల,సమర్ధ్ సింగ్ లకు జ్యుడీషియల్ కస్టడీ

భోపాల్కు చెందిన రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మరణం కేసులో వీరిద్దరి పోలీస్ రిమాండ్ ముగియడంతో భోపాల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. ట్విషా శర్మ కుటుంబ సభ్యులు వీరిపై కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ రోజు కోర్టులో జరిగిన విచారణ తీవ్ర ఉత్కంఠ రేపింది. రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ కోర్టులో స్వయంగా తీవ్ర ఆవేశంతో వాదనలు వినిపించడంతో, కోర్టు హాల్ నాటకీయ పరిణామాలకు, వాదోపవాదాలకు వేదికైంది.



