← Back to news

ట్విషా శర్మ కేసులో గిరిబాల,సమర్ధ్ సింగ్ లకు జ్యుడీషియల్ కస్టడీ

By DS· 2 Jun 2026· Ndtv· Bhopal
 ట్విషా శర్మ కేసులో  గిరిబాల,సమర్ధ్ సింగ్ లకు జ్యుడీషియల్ కస్టడీ

భోపాల్‌కు చెందిన రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మరణం కేసులో వీరిద్దరి పోలీస్ రిమాండ్ ముగియడంతో భోపాల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. ట్విషా శర్మ కుటుంబ సభ్యులు వీరిపై కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ రోజు కోర్టులో జరిగిన విచారణ తీవ్ర ఉత్కంఠ రేపింది. రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ కోర్టులో స్వయంగా తీవ్ర ఆవేశంతో వాదనలు వినిపించడంతో, కోర్టు హాల్ నాటకీయ పరిణామాలకు, వాదోపవాదాలకు వేదికైంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.