అనంతపురం జిల్లాలో పోలీసుల అరాచకం..
అనంతపురం జిల్లా పెదవడుగూరులో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. పోలీస్ స్టేషన్ ముందు ఒక ఎస్సి దళిత యువకుడిని SI దారుణంగా కొట్టారు. రాజకీయ నాయకులను సంతోషపెట్టడానికే పోలీసులు ఇలా అమాయకులను వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే ఇలా నేరుగా శిక్షలు విధిస్తే, ఇక కోర్టులు మరియు చట్టాలు ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భారీగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.



