కంపెనీ అయినా పెట్టాలే.. లేకపోతే మా భూములు మాకియ్యాలె..

‘‘కంపెనీలు పెట్టడానికి భూములు కావాలంటే ఇచ్చినం. ఇప్పటి దాకా కంపెనీ రాలే. కంపెనీలు వస్తే మా లోకల్ వాళ్లకు జాబులొస్తయ్ అనుకున్నం. ఇగ అట్ల లేదనుకుంటే మా భూములు మాకియ్యాలె...‘‘ అని రైతులు చెబుతున్నారు. వికారాబాదు జిల్లా, మోమిన్ పేట మండలం, ఎన్కతల గ్రామంలో రాష్ర్ట ప్రభుత్వం ఎలక్ర్టానిక్ వాహనాల కోసం ’మొబిలిటీ వ్యాలీ’ ఏర్పాటు కోసం భూములను సేకరించింది. రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ MLA ఆనంద్ రైతులను కలిశారు. పరామర్శించారు. మద్ధతు తెలిపారు.





