పోలీసుల బిగ్ ఆపరేషన్.. డ్రోన్తో స్పెషల్ పెట్రోలింగ్

TG: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిఘా పెంచారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పరిధిలోని శ్రీరాంపూర్ పోలీసులు డ్రోన్ సహాయంతో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రగతి స్టేడియం పరిసరాలు, అరుణక్కనగర్, హైవే ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు గుర్తించారు. వారిపై మూడు ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు శ్రీరాంపూర్ సీఐ ఆకుల అశోక్ తెలిపారు.



