జీతం తగ్గితే ఎలా బతకాలి?.. కార్మికుల ఆవేదన

TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు GO నెం.1181ను వ్యతిరేకిస్తూ గురువారం నిరసన చేపట్టారు. ఈ జీవో అమలుతో తమ నెలవారీ వేతనాల్లో సుమారు రూ.4 వేల కోత పడిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తక్కువ జీతాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, వేతనాల తగ్గింపు మరింత భారంగా మారిందన్నారు. జీవోను వెంటనే రద్దు చేసి, మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి స్థిరమైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.



