← Back to news

లారీ డ్రైవర్‌పై దాడిని ఖండిస్తూ భీమవరంలో ఆందోళన

By Mohammad Taheer· 26 Aug 2026
లారీ డ్రైవర్‌పై దాడిని ఖండిస్తూ భీమవరంలో ఆందోళన

AP: విశాఖపట్నంలో లారీ డ్రైవర్‌పై RTO అధికారులు చేసిన దాడిని ఖండిస్తూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా అనుబంధ పరిశ్రమల వెహికల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. డ్రైవర్లపై అధికారులు దాడులకు పాల్పడటం సరికాదని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్లతో అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Local