← Back to news

నాగులేరుకు నీళ్లు విడుదల చేయాలి

By siva· 1h ago
నాగులేరుకు నీళ్లు విడుదల చేయాలి

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో నాగులేరుకు నీటిని విడుదల చేయాలని స్థానికులు కోరారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇళ్ల బోర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో తాగునీటి ఇబ్బందులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు. సాగర్ కుడికాలువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నాగులేరుకు కూడా నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు. నాగులేరులో నీరు చేరితే భూగర్భ జలాలు పెరిగి బోర్లకు నీరు అందే అవకాశం ఉందని స్థానికులు పేర్కొన్నారు.

More in Local