హ్యామ్ రోడ్ల పనుల్లో వేగం పెంచాలి: కోమటిరెడ్డి

తెలంగాణలో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అనుమతుల పేరుతో కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేయొద్దని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై చర్చించారు. రూ.5 కోట్ల పనికి రూ.54 కోట్ల జరిమానా విధించడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే చిన్న కాంట్రాక్టర్లపై అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించకూడదన్నారు.



