హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు బుల్లెట్ ట్రైన్

TG: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే బుల్లెట్ ట్రైన్ మార్గానికి తెలంగాణ ప్రభుత్వం అలైన్మెంట్లో మార్పులు చేసి కేంద్ర ప్రభుత్వానికిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లాలంటే గంటల కొద్దీ సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వేలాదిమంది భక్తులు తరచూ వెళ్తుంటారు. ఈ ఉద్దేశంతో అలైన్మెంట్ మార్చాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. శంషాబాద్, భారత్ ఫ్యూచర్సిటీ, ఆమనగల్లు, మన్ననూరు, శ్రీశైలం, సోమశిల మీదుగా బెంగళూరుకు దారిని ప్రతిపాదించారు.



