రోడ్డు పక్కన వాడిన సిరంజీలు.. ప్రజలకు భయం!

TG : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో హాస్పిటల్ చెత్తను రోడ్లపై పడేస్తున్నారు. నంది విగ్రహం, వాల్గొట్ బంగ్లా దగ్గర వాడిన సిరంజీలు కనిపించడంతో ప్రజలు భయపడుతున్నారు. వాడిన సిరంజీలను పద్ధతి ప్రకారం జాగ్రత్తగా పారవేయాలి. ఇలా ఇష్టమొచ్చినట్లు బహిరంగంగా పడేస్తుండటంతో రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి వీటిని పడేసే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




