ఆ భావజాలం మళ్లీ బలపడకుండా చూస్తాం: DGP

TG: 'ఆపరేషన్ కగార్' తర్వాత రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని DGP CV ఆనంద్ పేర్కొన్నారు.<br>ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలోని CRPF బేస్ క్యాంప్ను సందర్శించారు. లొంగిపోయిన వారి కోసం పునరావాస చర్యలు చేపడుతున్నామని, వారిపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ఆ భావజాలం తిరిగి జీవం పోసుకోకుండా చూస్తామన్నారు. ఇటీవల లొంగిపోయిన 23 మంది మావోయిస్టులకు ఆర్థిక సాయాన్ని, ఆరోగ్య కార్డులను అందజేశారు.



