ఆస్తి కోసం అత్తను చంపింది

TG: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెంలో కొణతం భాగ్యమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో మృతురాలి కోడలు మధురనే హత్య చేసినట్లు తేలింది. భాగ్యమ్మకు 6ఎకరాల భూమి ఉంది. భూమిలో వాటా కావాలని కుమార్తె శోభారాణి కోర్టులో కేసు వేసింది. దీంతో అత్తా, కోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అత్తను చంపాలని డిసైడ్ అయిన మధుర, ఆమెను గట్టిగా నెట్టివేసింది. మళ్లీ లేవగా, వెనుక నుంచి చేతులతో మెలివేసి మంచంపైకి నెట్టి చంపినట్లు DSP ప్రసన్నకుమార్ తెలిపారు. మధురను అరెస్ట్ చేశామన్నారు.



