మంచిర్యాలలో BJP ఆందోళన

TG : 22A నిషేధిత భూముల జాబితాలో జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని కోరారు. మంచిర్యాల కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు కలెక్టరేట్ గేటుకే వినతిపత్రాన్ని కట్టి తమ నిరసనను తెలియజేశారు.



