అరెస్టులతో ఉద్యమం ఆగదు: మాదరి శ్రీకాంత్

TG: ములుగు జిల్లా కేంద్రంలో విద్యార్థుల హక్కుల కోసం ప్రశ్నించినందుకు తనను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనమని BJYM ములుగు జిల్లా అధ్యక్షుడు మాదరి శ్రీకాంత్ ఆరోపించారు. రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. విద్యార్థి మహాధర్నాకు అనుమతి నిరాకరించడాన్ని ప్రశ్నించిన శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి నార్లాపూర్ పోలీస్స్టేషన్కు తరలించారు.



