జేపీ నడ్డాను కలిసిన CJP ప్రతినిధులు

దిల్లీలో నిరసన తరువాత కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులతో ప్రభుత్వం సమావేశమైంది. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ 'X' వేదికగా స్పందిస్తూ తను, అశుతోష్ రాన్కాతో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను ఆయన నివాసంలో కలిశామని తెలిపారు. తాము తమ డిమాండ్లతో కూడిన లేఖను సమర్పించగా, ఈలోగా ఆయన అంతర్గతంగా దీనిపై మాట్లాడతానని హామీ ఇచ్చారని అన్నారు.



