← Back to news

దేశంలో నిరసనలు జరుగుతున్నా, APలో స్పందన లేదు

By DK· 22 Jul 2026
దేశంలో నిరసనలు జరుగుతున్నా, APలో స్పందన లేదు

AP: YCP నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నీట్, DSC పేపర్ లీకేజీలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్‌పై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నా, APలో అలాంటి స్పందన కనిపించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. సినిమా బెనిఫిట్ షోల విషయంలో ప్రజలు, యువత చూపే ఉత్సాహం విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్, డీఎస్సీ అంశాలపై ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. పేపర్ లీకేజీల వల్ల వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, ఇప్పటికైనా మౌనం వీడి విద్యార్థుల హక్కుల కోసం గళం వినిపించాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు.

More in Politics