దావూద్ అనుచరుడి ఆటకట్టించిన కొరియర్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు, అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ సలీమ్ డోలాను టర్కీ ప్రభుత్వం తాజాగా భారత్కు అప్పగించింది. ఇస్తాంబుల్లో అజ్ఞాతంలో ఉన్న సలీమ్ తాను ఉంటున్న ఇంటికి ఒక కొరియర్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు. అప్పుడు చేసిన ఫోన్ కాల్ తో ఇండియన్ పోలీసులు అతడిని గుర్తించి టర్కీకి సమాచారం అందించారు. అలా అతడు పట్టుబట్టాడు. డ్రగ్స్ నెట్వర్క్, టెర్రర్ ఫండింగ్లో కీలక పాత్ర పోషించిన సలీమ్ ఇప్పుడు భారత ఏజెన్సీల కస్టడీలో ఉన్నాడు. అండర్ వరల్డ్ ముఠాలకు ఇది భారీ షాక్!



