← Back to news

ఆరు ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు

By Srikanth Goud· 21 Aug 2026· Jagitial, Jagitial, Jagitial

TG: జగిత్యాల జిల్లాలో రూ.11.80 కోట్ల అంచనా వ్యయంతో ఆరు ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జగిత్యాల, మెట్‌పల్లి ఆర్డీవో కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించనున్నారు. ధరూర్ క్యాంప్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందుతాయని మంత్రి పొంగులేటి తెలిపారు.

More in Local