ట్విషా శర్మ అత్త, మాజీ జడ్జి గిరిబాల సింగ్ అరెస్ట్

మాజీ మోడల్ ట్విషా శర్మ మృతి కేసులో నిందితురాలిగా ఉన్న ట్విషా శర్మ అత్తగారు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గిరిబాల సింగ్ న CBI ఈరోజు భోపాల్లో అరెస్ట్ చేసింది. ఆమె ఇంట్లో దాదాపు 7 గంటల పాటు సోదాలు, విచారణ జరిపిన అనంతరం సీబీఐ ఈ చర్య తీసుకుంది. గిరిబాల సింగ్కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను మధ్యప్రదేశ్ హైకోర్టు నిన్న రాత్రి (మే 27) రద్దు చేసింది. ఆమె దర్యాప్తుకు సహకరించడం లేదని, నోటీసులకు స్పందించడం లేదని కోర్టు తీవ్రంగా పరిగణించింది.మే 12న భోపాల్లోని అత్తవారింట్లో ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించగా, వరకట్న వేధింపుల ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుంది.



