అప్పులు తీర్చలేక దంపతుల ఆత్మహత్య

TG: తీవ్ర ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్(32), శిరీష(28) దంపతులు. వీరు గత కొంతకాలంగా జీవనోపాధి కోసం హైదరాబాద్కు వలసవచ్చి, హయత్నగర్ సమీపంలోని కుంట్లూరులో నివాసం ఉంటున్నారు. అప్పుల భారం పెరగడం, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు కిందపడి దంపతులు మృతి చెందారు.



