అత్తమామల స్కెచ్కి ప్రేమ జంట బలి!

రంగారెడ్డి జిల్లా జనవాడలో ఘోరం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలసాయి, పద్మ దంపతులు అత్తమామల మోసానికి బలయ్యారు. ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయంటూ నమ్మించిన అత్తమామలు, పూజల కోసం బాలసాయి చేత ₹10 లక్షలు అప్పు చేయించారు. తీరా తవ్వితే ఏమీ దొరకలేదు. అప్పు ఇచ్చిన వారి ప్రెషర్ తట్టుకోలేక, మోసపోయామని గ్రహించిన ఈ జంట ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఐదు నెలల చిన్నారి అనాథగా మిగిలింది. బాలసాయి ఫోన్ మెసేజ్ ఆధారంగా పోలీసులు అత్తమామలను, బావను అరెస్ట్ చేశారు.



