← Back to news

కాళేశ్వరం అంశంలో కేసీఆర్ కు బిగ్ రిలీఫ్

By aravinda nyayapati· 22 Apr 2026· Hyderabad
కాళేశ్వరం అంశంలో కేసీఆర్ కు బిగ్ రిలీఫ్

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ వచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆ కమిటీ ఎలాంటి నిబంధనలు పాటించకుండా నివేదిక రూపొందించిందని కోర్టు చెప్పింది. ఈ రిపోర్ట్ చెల్లదని, సీబీఐ కూడా ఈ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై 2025 జులైలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది.

More in Local