కాళేశ్వరం అంశంలో కేసీఆర్ కు బిగ్ రిలీఫ్

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ వచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆ కమిటీ ఎలాంటి నిబంధనలు పాటించకుండా నివేదిక రూపొందించిందని కోర్టు చెప్పింది. ఈ రిపోర్ట్ చెల్లదని, సీబీఐ కూడా ఈ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై 2025 జులైలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది.

