← Back to news

కరీంనగర్ MP ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

By DK· 22 Jul 2026
కరీంనగర్ MP ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

TG: ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల అరెస్టుకు నిరసనగా కరీంనగర్‌లో జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు బీజేపీ MP కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనకు దిగడంతో BJP కార్యకర్తలతో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, కర్రలతో పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తెచ్చి, అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

More in Politics