బడిలో మిగిలింది టీచరమ్మే

TG: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కడాపగండి తండా ప్రాథమిక పాఠశాలలో టీచరే విద్యార్థిగా మారింది. గతేడాది ఆ పాఠశాల మూతపడినా నేతల ఒత్తిడితో ఈ ఏడాది తెరుచుకుంది. మొదట్లో 13 మంది విద్యార్థులు వచ్చేవారు. రానురానూ ఆ సంఖ్య పూర్తిగా తగ్గిపోయి ఒక విద్యార్థి మాత్రం వస్తున్నాడు. శుక్రవారం ఒక్క విద్యార్థి ఇంటికి వెళ్లిపోవడంతో టీచర్ ఒక్కరే కూర్చున్నారు.



