← Back to news

నకిలీ DAPపై మంత్రి తుమ్మల సీరియస్‌

By dk· 14 Aug 2026· హైదరాబాద్
నకిలీ DAPపై మంత్రి తుమ్మల సీరియస్‌

TG: రాష్ట్రంలో నకిలీ DAP ఎరువుల తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. నకిలీ ఎరువులతో నష్టపోయిన రైతులకు సంబంధిత వ్యక్తుల నుంచే పరిహారం ఇప్పిస్తామని తెలిపారు. ఇప్పటికే నకిలీ DAP తయారీకి సంబంధించి 8మందిపై కేసులు నమోదు చేసి, ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నకిలీ ఎరువులను పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.

More in TG