సోమశిలకు వెళ్లే టూరిస్టులకు గుడ్న్యూస్

TG: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో పర్యాటకులకు బోటింగ్ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గడంతో వేసవిలో నిలిచిపోయిన బోటింగ్ సేవలను, ప్రస్తుతం వరద జలాలతో నీటిమట్టం పెరగడంతో ఆదివారం నుంచి పునఃప్రారంభించారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ బోటింగ్ సేవలను ప్రారంభించారు. సోమశిలకు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నదిలో బోటింగ్ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించాలని సూచించారు.



