← Back to news

లంచం అడిగి చెప్పు దెబ్బలు తిన్న అధికారి!

By Subhash· 1 May 2026· X· Telangana

హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో టికెట్ తనిఖీ అధికారుల తీరు వివాదాస్పదమైంది. రాయకోడ్ వద్ద తనిఖీల్లో ఒక ప్రయాణికుడి వద్ద టికెట్ లేకపోవడంతో, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు అధికారి 20 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన కండక్టర్ మరియు ప్రయాణికులు సదరు చెకింగ్ ఆఫీసర్‌పై చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.