బిచ్చం వేసినట్లు నిధులు కేటాయించారు: బండి

TG: హైదరాబాద్లోని పాతబస్తీ లాల్దర్వాజ సింహవాహిని అమ్మవారిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బోనాల పండుగ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, సరైన ఏర్పాట్లు చేయడంతో పాటు తగిన నిధులు కేటాయించలేదని ఆరోపించారు. భక్తుల భావోద్వేగాలను హేళన చేస్తూ బిచ్చం వేసినట్లుగా సింహవాహిని అమ్మవారి ఆలయానికి కేవలం రూ.5.50 లక్షలు కేటాయించడం దారుణమని ఫైరయ్యారు. BJP అధికారంలోకి వస్తే ఈ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా అభివృద్ధి చేస్తామన్నారు.



