స్టూడెంట్స్పై దాడికి సమాధానం చెప్పాల్సిందే- రాహుల్ గాంధీ

పేపర్ లీక్ వివాదం, స్టూడెంట్స్ పై జరిగిన దాడి అంశంపై ప్రతిపక్ష MPలతో కలిసి రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్ను కలిశారు. తమ భవిష్యత్తుపై న్యాయమైన ప్రశ్నలు అడిగిన స్టూడెంట్స్ పై పోలీసులు దాడి చేయడం దారుణమని, దీనిపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై మాట్లాడని పార్లమెంట్ ఎందుకని విమర్శించారు. యువత ఆందోళనను పక్కదారి పట్టనివ్వమని, ఈ సమస్యపై వీధుల్లోనూ, పార్లమెంట్లోనూ ప్రతిపక్షాలు పోరాడుతాయని స్పష్టం చేశారు.


