డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో బిగ్ స్కామ్ !

TG: పేదలకు ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తామని భారీ మోసానికి పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ స్కామ్లో ఏడుగురు నిందితులను గుర్తించగా వారిలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మల్కాజ్గిరి DCP శ్రీధర్ తెలిపారు. గతంలో GHMCలో పనిచేసి, ప్రస్తుతం కలెక్టరేట్లోని అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్న తిమ్మరి పుష్పలత, ఆమె కుమారుడు విశాల్ ఈ మోసంలో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించారు. ఈ ముఠా 100మంది నుంచి దాదాపు కోటి రూపాయలు వసూలు చేసినట్లు వెల్లడించారు.



