← Back to news

బైక్‌పై నుంచి పడిన యువకుడిని ఈడ్చుకెళ్లిన కారు

By dk· 14 Aug 2026· రంగారెడ్డి జిల్లా
బైక్‌పై నుంచి పడిన యువకుడిని ఈడ్చుకెళ్లిన కారు

TG: రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ వద్ద హైదరాబాద్‌-శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొనడంతో తాండ్రకు చెందిన శివయాదవ్‌ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆయనను ఢీకొని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలతో శివయాదవ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

More in TG