గుంటూరులో మర్డర్ చంపింది లాయరే!

గుంటూరులో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు. లాయర్ సురేశ్ తన ఫ్రెండ్తో కలిసి ఈ మర్డర్ చేసినట్లు SP వకుల్ జిందాల్ వివరించాడు. బాధితురాలికి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని సురేశ్ 25 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత డబ్బుల విషయంలో గొడవలు రావడంతో, ఆమెను చంపాలని ప్లాన్ వేశాడు. శ్రీశైలం వెళ్దామని నమ్మించి తీసుకెళ్లి, తలపై కర్రలతో కొట్టి చంపేసి బాడీని కాలువలో పడేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.



