బాబా వేషంలో రౌడీషీటర్

TG: 2018 హైదరాబాద్ నగరం సైఫాబాద్ హత్య కేసుకు సంబంధించి పరారీలో ఉన్న నిందితుడు, రౌడీషీటర్ మహ్మద్ జావేద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లు కప్పేందుకు అతను సంగారెడ్డి జిల్లా చేర్యాలలోని ఓ దర్గాలో బాబా అవతారమెత్తాడు. ఖైరతాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పరీక్షల్లో అతడు గంజాయి తాగినట్టు నిర్ధారణ కావడంతో సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.



