నిరుపేద మృతుడికి సీఐ సాయం..!
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో కుమ్మర వీధికి చెందిన పత్తి వెంకట్రావు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు భార్య పద్మావతి తప్ప ఎవరూ లేరు. అంత్యక్రియలు చేయడానికి ఆమె ఇబ్బంది పడుతుండగా, రాజాం పట్టణ సీఐ నవీన్ కుమార్ స్పందించారు. ఆయన అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అలాగే పద్మావతికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సాయం ప్రజలందరినీ ఆకట్టుకుంది. మీ ఊరిలో ఇలాంటి మానవత్వం ఉందా? మీ ఊరి వార్త మీరే పంపండి!


