NSUI బలోపేతానికి కృషి..!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పురుషోత్తం అనూప్ నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్ అసెంబ్లీ భవన్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిశారు. తనను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో పనిచేస్తూ ఎన్ఎస్యూఐని బలోపేతం చేస్తానన్నారు. విద్యార్థుల హక్కుల సాధనకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.



