మంత్రాలయం దగ్గర రోడ్డు ప్రమాదం 8 మంది మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలడోన వద్ద బొలెరో వాహనం, లారీ ఢీకొన్న ఘటనలో 8 మంది మరణించారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. కర్ణాటకలోని చిక్ మంగళూరుకు చెందిన భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.



