బ్యారికేడ్లు ఎక్కి నిరసనలు కొనసాగించిన AAP నేతలు

కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన 'ఛలో సంసద్' ర్యాలీకి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మద్దతిచ్చారు. AAP నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, అతిషి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఎక్కి ఆందోళనకారులను కలిశారు. నీట్ 2026 ప్రశ్నాపత్రం లీక్కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సిసోడియా డిమాండ్ చేశారు. యువత పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని నిరసనలు చేస్తున్నారని అన్నారు.



