← Back to news

శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్!

By sahani· 29 May 2026· Andhrajyothy· AndhraPradesh
శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్!

కృష్ణా జిల్లా కేసరపల్లిలోని శ్రీ చైతన్య క్యాంపస్‌లో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం అందరిని షాక్ కి గురిచేసింది. అనంతపురం జిల్లాకు చెందిన కప్పల యశ్వంత్(18) అనే స్టూడెంట్ తన హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ విషయం తెలిసి స్టూడెంట్ పేరెంట్స్, relatives కాలేజీకి వచ్చి పెద్ద గొడవ చేశారు. తమ బాబు చనిపోవడానికి రీజన్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ టైమ్‌లో పోలీసులు, పేరెంట్స్ మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. పోలీసులు తమపై దౌర్జన్యం చేశారంటూ పేరెంట్స్ రోడ్డుపై కూర్చున్నారు. పోలీసులు కొందరిని ఈడ్చుకెళ్లడంతో అక్కడ వాతావరణం ఫుల్ టెన్షన్‌గా మారింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.