నిరాహార దీక్షను విరమించిన నేహా బోరా

23 రోజులుగా విద్యార్థి నాయకులు నేహా బోరా, మనీష్ కుమార్, అమీన్ అమితోజ్లు జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. పార్లమెంటు సభ్యులు మనోజ్ ఝా, రాజారామ్ సింగ్, అమ్రా రామ్లతోపాటు న్యాయవాదులు, ప్రొఫెసర్లు దీక్షను విరమించాలని వారిని కోరారు. ఎలా పోరాడాలో ప్రతిపక్షాలన్నింటికీ మార్గం చూపించారని రాజారామ్ సింగ్ వారితో అన్నారు. వారి విజ్ఞప్తితో నిరాహార దీక్షను విరమించారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది.



