స్టూడెంట్స్పై లాఠీఛార్జ్.. రాజ్యసభలో ఖర్గే తీవ్ర ఆగ్రహం!
NEET పరీక్షల వివాదంపై జంతర్ మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న వేలాది మంది విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వం వారిని కొట్టి, భయపెట్టి, ఆందోళనలను అణచివేయడానికి చూస్తోందని ఆరోపించారు. యువత గొంతును నొక్కేయాలని చూస్తున్నారని, ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.


