← Back to news

బెంగళూరు భారీ సైబర్ మోసం. మహిళ నుంచి 24 కోట్లు దోపిడి

By AR· 25 May 2026· Ndtv· Bangalore
బెంగళూరు భారీ సైబర్ మోసం. మహిళ నుంచి 24 కోట్లు దోపిడి

బెంగళూరులో 74 ఏళ్ల లక్ష్మీ రామమూర్తి అనే మహిళ డిజిటల్ అరెస్ట్ బారిన పడి ఏకంగా రూ.24 కోట్లు కోల్పోయారు. CBI, ED అధికారులమని చెప్పిన సైబర్ మోసగాళ్లు వీడియో కాల్‌ చేసి మనీలాండరింగ్ కేసులో మీ పేరు ఉందంటూ భయపెట్టారు. ఆస్తులు అమ్మిన ఆమె డబ్బులన్నీ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 26 లావాదేవీల్లో మొత్తం 23 అకౌంట్లలో జమ చేయించుకున్నారు. 1.3 కేజీల బంగారం తాకట్టు పెట్టడానికి ఆమె బ్యాంకుకి వెళ్లినప్పుడు మేనేజర్ కి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ భారీ స్కామ్ బయటపడింది. పోలీసులు రంగంలోకి దిగి ₹5.46 కోట్లు ఫ్రీజ్ చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.