← Back to news

బాలుడి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే!

By Mahesh· 20 Jul 2026· UP

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఖేరీలో 'సంపూర్ణ సమాధాన్ దివస్' కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మేజిస్ట్రేట్, జిల్లా పోలీసులు, ఉన్నదాధికారులు పాల్గొన్నారు. ఇంతలో అక్కడికి 13ఏళ్ల బాలుడు అమితాబ్ గుప్తా వచ్చి తన ఇంటిని బంధువులు ఆక్రమించారని నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదిచ్చాడు. "కమీషన్ ఇస్తేనే పని అవుతుందా?" అంటూ పోలీసును ప్రశ్నించాడు. ఆ బాలుడి ధైర్యాన్ని చుసిన అక్కడివారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More in News