← Back to news

ORRలో ఘోర ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!

By Subhash· 2 May 2026· Socialnews· Hyderabad
ORRలో ఘోర ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!

హైదరాబాద్ ORR పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షంషాబాద్ దగ్గర ఆగి ఉన్న ట్రక్కును అతివేగంతో వస్తున్న కార్ వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. యాదగిరిగుట్ట దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయాలయిన వాళ్ళను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.