హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు రాజేశ్వరరావు కన్నుమూత

TG: హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజేశ్వరరావు(75) మున్సూరాబాద్లోని స్వగృహంలో అకస్మాత్తుగా మృతి చెందారు. 1951లో తాడిపత్రి సమీపంలో జన్మించిన ఆయన 1976 నుంచి విశాలాంధ్ర ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసి జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్లో తొలి కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కోశాధికారిగా 36 ఎగ్జిబిషన్లకు సేవలందించారు. ప్రగతి పబ్లికేషన్ను కూడా ఏర్పాటు చేశారు. రైలు ప్రమాదంలో కాలు, చేయి కోల్పోయినా సాహితీ సేవలు కొనసాగించారు.



