← Back to news

భర్త నరాల్లోకి హార్పిక్‌ ఎక్కించి హత్య

By డీకే· 7 Jul 2026
భర్త నరాల్లోకి హార్పిక్‌ ఎక్కించి హత్య

TG: నిజామాబాద్ జిల్లా మోపాల్‌ మండలం న్యాల్‌కల్‌కు చెందిన ప్రశాంత్‌(35), సంధ్య దంపతులు. ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లిన ప్రశాంత్‌ గతనెల 27న తిరిగి వచ్చాడు. సంధ్యకు అనిల్‌తో వివాహేతర సంబంధముంది. భర్తను అడ్డు తొలగించుకోవాలని న్యాల్‌కల్‌ వాసి బంటితో సంధ్య ప్లాన్ వేసింది. మద్యం తాగించి భర్తను దాబా పైనుంచి తోసేశారు. కానీ ప్రశాంత్‌ గాయాలతో బయటపడడంతో హాస్పిటల్‌లో చికిత్స చేయించారు. భర్త ఎక్కడ కోలుకుంటాడోనని భావించిన సంధ్య, అతని చేతికి ఉన్న సెలైన్ బాటిల్ ద్వారా టాయిలెట్‌ క్లీనర్(హార్పిక్)‌ను ఎక్కించింది. ప్రశాంత్‌ కన్నుమూశాడు. పోలీసులు సంధ్య, బంటి, అనిల్‌ను అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 19h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.