← Back to news

పోక్సో కేసు నిందితుడి ఆత్మహత్య

By DK· 16 Jul 2026
పోక్సో కేసు నిందితుడి ఆత్మహత్య

TG: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతామన్‌పల్లి గ్రామానికి చెందిన రంగబోయిన సందీప్ (23) గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గతంలో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న సందీప్ ఇటీవలే జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి బాలిక తల్లిదండ్రులు తనను బెదిరిస్తున్నారని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత బాలిక కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 17h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.