← Back to news

భార్యకు వీడియో కాల్ చేస్తూ వ్యక్తి ఆత్మహత్య!

By sahani· 6 Jul 2026· Warangal
భార్యకు వీడియో కాల్ చేస్తూ వ్యక్తి ఆత్మహత్య!

వరంగల్ జిల్లా కాజీపేటలో షాకింగ్ ఘటన జరిగింది. రాజేష్ నాయక్ (45) అనే డాక్యుమెంట్ రైటర్, ఆస్తి గొడవల వల్ల భార్య, తల్లిదండ్రులతో గొడవపడి రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రైలు పట్టాలపై నిలబడి, ఎదురుగా వస్తున్న రైలును భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ సూసైడ్ చేసుకున్నాడు. తాను చనిపోతున్నానని చెప్తే అతను బెదిరిస్తున్నాడని ఆమె లైట్ తీసుకుంది. సోమవారం ఉదయం పట్టాలపై శవమై తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 19h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.