వరద నీళ్లు వస్తున్నా.. పంప్లు ఆన్ చేయడం లేదు

తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరద నీరు వస్తున్నప్పటికీ ప్రభుత్వం ప్రాజెక్టుల పంపులను పూర్తిస్థాయిలో నడపడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జూరాల నుంచి పవర్ జనరేషన్ పేరుతో భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని, అదే సమయంలో రిజర్వాయర్లను నింపే ప్రయత్నాలు చేయడం లేదన్నారు. రైతుల ఆందోళన తర్వాతే కొన్ని పంపులను ప్రారంభించారని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ప్రతి చుక్క నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.



