లక్షల విలువైన నగల చోరీ-పట్టించిన ఇన్ స్టా రీల్ !

ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఒక వెరైటీ దొంగతనం కేసు వెలుగుచూసింది. ఒక ఇంట్లో పనిమనిషిగా ఉండే విమలా దేవి అనే మహిళ, దాదాపు ఏడాది క్రితం యజమాని ఇంట్లోంచి ₹10 లక్షల వర్త్ గల డైమండ్ నెక్లెస్, గోల్డ్ లాకెట్ దొంగిలించింది. అప్పట్లో ఓనర్ అడిగితే తనేం తీయలేదంటూ బుకాయించింది. కట్ చేస్తే.. రీసెంట్గా ఆ పనిమనిషి దొంగిలించిన నగలు వేసుకుని ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసి వా ట్సాప్ స్టేటస్ పెట్టింది. అది చూసిన ఓనర్ ఫ్రెండ్ వెంటనే అలర్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఓనర్ ఇచ్చిన కంప్లైంట్తో పోలీసులు విమలా దేవిని అరెస్ట్ చేసి, ఆమె దొంగిలించిన నగలను రికవర్ చేశారు.



